
నేపాల్ లో జలప్రళయం.. బురదలో కూరుకుపోయిన పవర్స్టేషన్
నేపాల్ను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి ఆ దేశంలోని జల విద్యుత్ రంగం తీవ్రంగా దెబ్బతింది. చైనా సరిహద్దుకు సుమారు 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్చీ ప్రాంతంలోని 'జెహ్రే' పవర్ సబ్స్టేషన్ పూర్తిగా నీట మునిగి బురదలో కూరుకుపోయింది.త్రిశూలి నదికి ఆనుకొని ఉన్న ఈ విద్యుత్ కేంద్రం మొత్తం బురదమయమైంది. ట్రాన్స్ఫార్మర్లు, ఇతర యంత్ర పరికరాలు ధ్వంసమై బురదలో కూరుకుపోయాయి. ప్రస్తుతం నేపాల్ సైనిక దళాల సహాయక చర్యల్లో నిమగ్నమై, బురదలో కూరుకుపోయిన యంత్రాలను వెలికితీసేందుకు శ్రమిస్తున్నాయి.నదీ తీరం వెంబడి ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్లు, తెగిపడిన విద్యుత్ తీగలు వరద ఉద్ధృతికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వరద సంభవించిన సమయంలో విధుల్లో ఉన్న రమేశ్ అనే ఎలక్ట్రీషియన్ ఆ భయానక పరిస్థితులను వివరించారు. "ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తోందన్న హెచ్చరికలతో ప్రాణాలు కాపాడుకోవడానికి కొండపైకి పరుగులు తీశాం. చూస్తుండగానే నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగి, సబ్స్టేషన్ను పూర్తిగా ముంచేసింది" అని ఆయన తెలిపారు. స్టేషన్ గోడలపై పైకప్పు వరకు కనిపిస్తున్న నీటి మరకలు వరద బీభత్సాన్ని చాటిచెబుతున్నాయి.ఈ విపత్తు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా వివిధ జల విద్యుత్ ప్రాజెక్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సుమారు 900 మంది కార్మికులు, ఉద్యోగుల ఆచూకీ ఆగస్టు 26 నుంచి లభించడం లేదు. వీరిలో అధిక శాతం మంది సొరంగాల్లో చిక్కుకుపోయి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యల్లో నేపాల్