
విశాఖ పాత ఎయిర్ పోర్టులో సర్వీసుల నిలిపివేతపై పిటిషన్ కొట్టివేత
దిల్లీ: విశాఖ పాత విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసుల నిలిపివేతపై దాఖలైన పిల్ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై ఏపీ హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని.. పాత విమానాశ్రయం నుంచీ విమాన సర్వీసులు నడపాలని విశాఖకు చెందిన కొసరాజు గోపాలకృష్ణ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం విచారణ చేపట్టింది. కొత్త ఎయిర్పోర్ట్ నగరానికి 60 కి.మీ దూరంలో ఉందని, కనెక్టివిటీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. 30 ఏళ్ల పాటు సేవలు అందించిన విశాఖ విమానాశ్రయంపై ఎయిర్పోర్ట్ అథారిటీ రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. భోగాపురం విమానాశ్రయం ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’తో నిర్మించడం ఆహ్వానించదగినదని.. అలా అని 30 ఏళ్ల పాటు సేవలు అందించిన ఎయిర్పోర్టు నుంచి సర్వీసులు నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు లేవని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది



